నిన్న గ్రేటర్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. చిన్న, చిన్న సంఘటనలు మినహా.. పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కానీ పోలింగ్ శాతం మాత్రం భారీగా పడిపోయింది. అయితే.. దీనిపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ” జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంత తక్కువ ఓటింగ్ నమోదు కావడం ఆవేదన కలిగిస్తున్నప్పటికీ… ఇందులో ప్రభుత్వం, ఎన్నికల సంఘం బాధ్యత ఎక్కువనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వరుస సెలవులు ఉన్నాయని తెలిసి, ఎక్కువ మంది నగరంలో ఉండే అవకాశం లేదని తెలిసి… ఈ సమయంలో ఎన్నికలు వచ్చేలా షెడ్యూల్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వమే వ్యూహాత్మకంగా పోలింగ్ను నిర్వీర్యం చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు ఓటరు నమోదు, ఓటరు జాబితాలో తగిన మార్పులు, చేర్పులు, అవకతవకలుంటే పరిశీలించి సరి చేయడానికి కావలసిన సమయం ఇవ్వకుండానే హడావుడిగా కేవలం రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్ళడం కూడా ఈ పరిస్థితికి దారి తీసిందనే విమర్శను కొట్టిపారేయలేం. ముఖ్యంగా చాలా డివిజన్లలో ఉద్దేశ్యపూర్వకంగానే ఎందరో ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. నేటి ఎన్నికల్లో చాలా చోట్ల స్లిప్పులు ఉన్నప్పటికీ ఓటరు లిస్టులో తమ పేర్లు లేవంటూ అనేకమంది ఓటర్లు నిరాశతో వెనుదిరగడం చూస్తే ఈ ఆరోపణలు నిజమని నమ్మక తప్పడం లేదు. ఈ పరిస్థితి ఓటర్లను నిరాశకు గురిచేసి పోలింగ్ బూత్లకు రాకుండా చేసింది. ఇది గాక, చాలా పోలింగ్ బూత్లలో కోవిడ్ సన్నద్ధత కనిపించలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇది కూడా ఓటర్లను భయపెట్టింది. మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో టీఆర్ఎస్ సర్కార్ కుట్ర పూరితంగా వ్యవహరించిందని అందరికీ స్పష్టమైంది.” అంటూ విజయశాంతి
పేర్కొన్నారు.
previous post