telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఐటీ రైడ్స్ : విజయ్‌కి విజయ్ సేతుపతి సపోర్ట్… ట్వీట్ వైరల్

Master

దళపతి విజయ్ ఐటీ రైడ్స్ కారణంగా గత వారం రోజులుగా వార్తల్లో నిలిచాడు. తాజాగా విజయ్‌కి మద్దుతుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘విజయ్‌పై జరిగిన ఐటీ సోదాల వెనక అసలు నిజాలు’ అంటూ ఔత్సాహిక జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ క్లిప్పింగ్‌ను పోస్ట్ చేస్తూ సేతుపతి ట్వీట్ చేశాడు. ‘‘విద్యావేత్త జెప్పియార్ కుమార్తె రెజీనా తమిళనాడులో క్రైస్తవ మత ఉద్యమానికి నాయకత్వం వహిస్తోందని, సేతుపతి, ఆర్య, రమేష్ కన్నాతో సహా నటులు ఇప్పటికే క్రైస్తవ మతంలోకి ‘మారారు’ అని.. రెజీనా AGS పేరిట విజయ్ యొక్క ‘బిగిల్‌’కు నిధులు సమకూర్చిందని, మరియు ఈ చిత్రం ద్వారా వచ్చిన ఆదాయాన్ని తిరిగి రెజీనాకు బదిలీ చేశారని, ఈ వ్యవహారమంతా హోం మంత్రిత్వ మరియు ఐటీ శాఖ నిశితంగా గమనిస్తున్నాయని’’ ఆ కథనంలో పేర్కొన్నారు. వివాదాలకు దూరంగా ఉండే విజయ్ సేతుపతి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ ‘బిగిల్’ చిత్రానికి సంబంధించిన లెక్కల విషయమై నిర్మాత, ఫైనాన్షియర్, విజయ్ ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన ఐటీ సోదాల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడిన విషయం తెలిసిందే. విజయ్ దగ్గరినుండి ఎలాంటి డాక్యుమెంట్స్ లభించలేదని సమాచారం. ఇప్పుడు ఈ సోదాల వ్యవహారం రాజకీయ రంగు పూసుకుంటూ కలకలం సృష్టిస్తున్నాయి. విజయ్‌ ఇంట్లో ఐటీ సోదాలకు బీజేపీ పార్టీనే కారణం అన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అందుకు కారణం విజయ్‌ నటించిన ‘మెర్శల్‌’ (అదిరింది) చిత్రంలో ఉచిత వైద్యం, జీఎస్‌టీ వంటి సన్నివేశాలు చోటు చేసుకున్న విషయం తెల్సిందే. అప్పుట్లో వీటిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అదేవిధంగా ‘బిగిల్‌’ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై నటుడు విజయ్‌ అన్నాడీఎంకే నాయకులకు వార్నింగ్‌ ఇచ్చే విధంగా మాట్లాడారు.

Related posts