టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు తన పరిస్థితిని ముందే అంచనా వేశాడని ఆయన ట్వీట్ చేశారు.
ఎవరైనా ఎలక్షన్లలో గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పుకుంటారు.. కానీ బాబు మాత్రం తన పరిస్థితిని ముందే అంచనా వేశాడు. ఎన్నికల్లో ఓడితే జైలుకు పోతా. జైలుకు వెళ్లకుండా ఉండాలంటే నన్ను గెలిపించాలి. అరెస్టు చేయడానికి వస్తే మీరంతా వలయంలా నిల్చుని రక్షణ కల్పించాలని భవిష్యవాణిని వినిపించాడు’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.