telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

14 ఏళ్ల పాటు విచ్చలవిడిగా దోచుకున్నాడు: విజయసాయిరెడ్డి

Vijayasai reddy ycp

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.. గతంలో విచ్చలవిడిగా దోచుకున్న చంద్రబాబు ఇన్నాళ్లూ తప్పించుకుంటూ వచ్చారని ఆయన ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.’మహాత్మా గాంధీ లాంటివాడినని కటింగులిచ్చాడని ఎద్దేవా చేశారు. .

నిప్పు కణికలు నన్ను చూసి ఈర్షపడతాయని గొప్పలు చెప్పాడు. అక్రమ సంపాదనను వ్యవస్థీకృతం చేసి 14 ఏళ్ల పాటు విచ్చలవిడిగా దోచుకున్నాడు. వ్యవస్థలన్నిటిని మ్యానేజ్ చేసి తప్పించుకుంటూ వచ్చాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గ్రహించలేక పోయాడు’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Related posts