టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.. గతంలో విచ్చలవిడిగా దోచుకున్న చంద్రబాబు ఇన్నాళ్లూ తప్పించుకుంటూ వచ్చారని ఆయన ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.’మహాత్మా గాంధీ లాంటివాడినని కటింగులిచ్చాడని ఎద్దేవా చేశారు. .
నిప్పు కణికలు నన్ను చూసి ఈర్షపడతాయని గొప్పలు చెప్పాడు. అక్రమ సంపాదనను వ్యవస్థీకృతం చేసి 14 ఏళ్ల పాటు విచ్చలవిడిగా దోచుకున్నాడు. వ్యవస్థలన్నిటిని మ్యానేజ్ చేసి తప్పించుకుంటూ వచ్చాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గ్రహించలేక పోయాడు’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.