రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘లైగర్స. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పాన్ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ హైప్ నెలకొని ఉండగా… ఫస్ట్ గ్లిమ్ప్స్ పై ప్రకటన చేశారు.
న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. డిసెంబర్ 31న ఉదయం 10.03 గంటలకు ఈ సినిమా గ్లింప్స్ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ది బిగ్ అనౌన్స్మెంట్ అంటూ విడుదల చేసిన ఈ వీడియో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో జోష్ నింపింది.
ఛార్మి, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్గా కనిపించనున్నాడు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. టైసన్ నటిస్తున్న ఫస్ట్ ఇండియన్ మూవీ లైగర్. ఇటీవలే మైక్ టైసన్ విజయ్ దేవరకొండ మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. అటు విజయ్.. ఇటు పూరీ జగన్నాథ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా ఇదే.
ప్రస్తుతం లైగర్ సినిమా క్లైమాక్స్ షూటింగ్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ లైగర్ మూవీలో భాగస్వామిగా ఉండగా.. మణిశర్మ లైగర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
సమంతా వల్లే అదంతా నేర్చుకున్నా..