telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇందిరాగాంధీ పాత్రలో విద్యాబాలన్

Indira-Gandhi

బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ గత పన్నెండేళ్లుగా కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. ‘డర్టీ పిక్చర్’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డుతో పాటు ఆరుసార్లు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా అందుకున్న విద్య, 2014లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందింది. ‘ఇష్కియా’, ‘ది డర్టీ పిక్చర్’, ‘కహాని’ లాంటీ చిత్రాలు చేసి యావత్ దేశం మొత్తం అభిమానుల్ని సంపాదించుకుంది. ఇక తాజాగా ఆమె హ్యూమన్ కంప్యూటర్ గా పేరు తెచ్చుకున్న గణిత మేధావి ‘శకుంతలాదేవి’ బయోపిక్ లో టైటిల్ రోల్ పోషించింది. విద్యా బాలన్ తన కెరీర్ లో మరో ఛాలెంజింగ్ పాత్రలో నటించేందుకు అంగీకరించారు. భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జీవితకథలో నటించేందుకు సన్నాహల్లో ఉన్నారు. ఈ చిత్రాన్ని తన భర్త ఆదిత్యారాయ్ కపూర్ నిర్మించనున్నారు. ఇక విద్యా బాలన్ తెలుగులో బాలకృష్ణ హీరోగా చేస్తూ నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించింది. ఆ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Related posts