telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ కు తల్లిగా ప్రముఖ హీరోయిన్…!

Prabhas

ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయిక. యు.వి.క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది. వినూత్న ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అలనాటి అగ్ర నాయిక భాగ్యశ్రీ ప్రధాన పాత్రలో నటించనుందని తెలుస్తున్నది. ప్రభాస్‌ తల్లిగా ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని అంటున్నారు. కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించడానికి భాగ్యశ్రీ సుముఖత వ్యక్తం చేసిందని తెలిసింది. ‘మైనే ప్యార్‌ కియా’ చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేసిన భాగ్యశ్రీ..అద్భుతమైన అందం, చక్కటి అభినయంతో అనతికాలంలోనే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. తెలుగులో ఆమె బాలకృష్ణ సరసన ‘రాణా’ (1998) చిత్రంలో నటించింది.

Related posts