మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న 66వ చిత్రాన్ని దీపావళి సందర్బంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తరకెక్కుతుందని నిర్మాత ఠాగూర్ మధు తెలిపారు. డాన్శీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత తమిళంలో విజయ్ నటించిన ‘తెరి’ సినిమాకు ఇది తెలుగు రీమేక్ అనే వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలపై గో్పీచంద్ మలినేని వివరణ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నిజ ఘటనల ఆధారంగా ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నానని, రీమేక్ సినిమా చేయడం లేదని అన్నారు. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ రెండో వారం నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. థమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం తమిళ సముద్రఖనిని ఎంపిక చేసింది చిత్ర బృందం. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు.
Versatile actor @thondankani on board for #RT66@RaviTeja_offl @shrutihaasan @megopichand @MusicThaman @TagoreMadhu @LightHouseMMLLP@UrsVamsiShekar pic.twitter.com/7pSlbOiG6V
— BARaju (@baraju_SuperHit) November 7, 2019