గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసిన చిత్రం “ఎఫ్-“2. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించగా, వారి సరసన మెహరీన్, తమన్నా కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించడమే కాకుండా బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్గా ఓ మూవీ రానుందంటూ కొన్నాళ్ళుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు వెంకీ. ఎఫ్3 సీక్వెల్ కోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ కాగా, అనిల్ రావిపూడి కొన్ని స్క్రిప్ట్స్ వినిపించారు. వాటిలో ఏ కథను సీక్వెల్ చేయాలో అర్ధం కావడం లేదు. ఇక లీడ్ రోల్స్ తాను, వరుణ్ చేస్తామని, హీరోయిన్లను కూడా ఫైనల్ చేయాల్సి ఉందని అన్నారు వెంకటేష్. ఇక “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో అనీల్ రావిపూడి బిజీగా ఉండగా, వెంకీ ‘అసురన్’ తెలుగు రీమేక్ స్టార్ట్ చేయనున్నారు. మరోవైపు వరుణ్ బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా చేయనున్నాడు. ఇవన్నీ పూర్తయ్యాక ఎఫ్3 సెట్స్ పైకి వెళ్లనుంది.