భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ఆయన వాణిజ్యానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టును వెంకయ్యకు అందజేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి స్థాయి సంఘం ఆమోదించిన 154వ నివేదికను వెంకయ్యనాయుడుకు విజయసాయిరెడ్డి అందజేశారు. సముద్రపు ఉత్పత్తుల ఎగుమతులు, పంటలు, పసుపు, కొబ్బరి పీచు వంటి వాటికి సంబంధించిన రిపోర్టును గౌరవనీయులైన రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతికి అందించడం జరిగిందని ట్విట్టర్ లో ఆయన పేర్కొన్నారు.