telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఉప రాష్ట్రపతి వెంకయ్య రామాయణ పఠనం

venkaiah Naidu

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. హిందువులంతా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి పునీతులవుతున్నారు. సామాన్యుల వద్ద నుంచి, ప్రముఖుల వరకు వారి ఇంటి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన అధికార నివాసంలో రాముడికి పూజలను నిర్వహించారు. తన సతీమణి ఉషతో కలిసి పూజలు చేశారు. రామాయణ పఠనం కూడా చేశారు. ఈ విషయాన్ని పూజ అనంతరం వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఉప రాష్ట్రపతి భవన్ సిబ్బంది కూడా రామాయణ పఠనంలో పాల్గొన్నట్టు వెంకయ్య వెల్లడించారు. 

Related posts