telugu navyamedia
సినిమా వార్తలు

ప్రభాస్ మల్టిప్లెక్స్ కు ఓపెనింగ్ కు గెస్ట్ ఎవరంటే ?

V

ప్రభాస్ తన స్నేహితులైన యువి క్రియేషన్స్ వారితో కలిసి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేటలో “వి ఎపిక్” పేరిట మల్టిఫ్లెక్స్ నిర్మించిన విషయం తెలిసిందే. ఆగస్టు 30న “సాహో” సినిమాతో ఈ థియోటర్ లాంచ్ కానుంది. ఈ మల్టిప్లెక్స్ కు షాపింగ్ మాల్ కూడా ఎటాచ్ అయ్యి ఉంటుంది. ఇక ఈ థియోటర్ స్పెషాలిటీ ఏమిటి అంటే… సౌత్ ఏషియాలోనే ఇంత పెద్ద స్క్రీన్ ఉన్న థియోటర్ లేదు. అలాగే లేటెస్ట్ డాల్బీ ఆట్మస్ సౌండ్ ఎక్విప్మెంట్ తో ఉంది. దాంతో ఈ థియోటర్ పైనే అందరి దృష్టీ ఉంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్… “సాహో”ని ఈ థియోటర్ లో ఫస్ట్ వీక్ లో చూడాలని ఉత్సాహపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ థియోటర్ ఓపినింగ్ కు ఎవరు వస్తారు? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ స్వంత థియోటర్ అయినప్పటికీ ఆ టైమ్ కు ఆయన లండన్ లో ఉండబోతున్నారు. ఈ నేపధ్యంలో ప్రభాస్ పెద నాన్న, నటుడు కృష్ణంరాజు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ఈ థియోటర్ లాంచింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది.

Related posts