telugu navyamedia
రాజకీయ వార్తలు

జీవన విధానాల మధ్య ఇదొక సంధి కాలం: వెంకయ్య

venkaiah naidu

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజా పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించారు. మానవుడి ఆధునిక జీవితం ఎంతో సాఫీగా దూసుకెళుతోంది అని భ్రమపడుతున్న సమయంలో కనిపించకుండా కరోనా వైరస్ వచ్చిందని తెలిపారు. పాజ్ బటన్ నొక్కినట్టుగా జీవితాన్ని ఆపేసిందని అన్నారు. రీసెట్ బటన్ ద్వారా పునఃప్రారంభాన్ని కూడా చూపించిందని పేర్కొన్నారు. సరిగ్గా చెప్పాలంటే రెండు జీవన విధానాల మధ్య ఇదొక సంధి కాలం అని అభివర్ణించారు.

మానవ జీవితం ఒక్కసారిగా నిలిచిపోయిందని, కరోనా సమయంలో ఏం నేర్చుకున్నామన్నదానిపై భవిష్యత్ పునాదులు లేస్తాయని వివరించారు.ఎలా జీవిస్తున్నామన్నదానిపై ఇప్పటివరకు సమీక్షించుకునే అవకాశం మనకు రాలేదు. కానీ కరోనా రూపంలో ఆ అవకాశం మన ముంగిట నిలిచింది. ఇప్పటికైనా జీవితాన్ని భేరీజు వేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరాన్ని కరోనా చాటిచెబుతోందని వెల్లడించారు.

Related posts