telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ డైరెక్షన్ లో, బీజేపీ ముసుగులో.. పవన్ పై మంత్రి వెల్లంపల్లి ఫైర్

srinivasa rao minister

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడ, పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురంలో బీటీ రోడ్డు నిర్మాణానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీడీపీ డైరెక్షన్ లో, బీజేపీ ముసుగులో అభివృద్ధికి ఇబ్బంది కలిగించాలని చూస్తే సహించమని మంత్రి హెచ్చరించారు.

రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమన్నారు. సీఎం జగన్ పై అవాకులు చవాకులు పేలడం మాని షూటింగ్ చేసుకోవాలని హితవు పలికారు. విజయవాడ నగర అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. 8వ డివిజన్ లో కోటి నలభై లక్షల రూపాయలతో ఈ రోడ్డును నిర్మిస్తున్నారని తెలిపారు. గత పాలకులు విజయవాడ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. 

Related posts