telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : వింత టాస్కులతో హౌజ్ మేట్స్ ఉక్కిరిబిక్కిరి

Bigg-Boss

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 తెలుగు ముగింపు దశకు చేరుకుంది. ఇంక ఒక్కవారం ఎలిమినేషన్ మాత్రమే ఉంది. ఇప్పటికే రాహుల్ ఫైనల్‌కు వెళ్లిపోయాడు. ఇక వరుణ్ సందేశ్, అలీ రెజా, శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతిల్లో నలుగురు ఫైనల్‌కు చేరుతారు. ఒక్కరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. దీంతో వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. హౌస్‌లో 94వ రోజు ‘బాబు ఏ రాంబాబు’ సాంగ్‌తో అందరూ నిద్రలేచారు. గార్డెన్ ఏరియాలో శ్రీముఖి, అలీ, వరుణ్ స్టెప్పులేశారు. కాకరకాయ కూర కోసం బాబా భాస్కర్‌తో శివజ్యోతి కాసేపు గొడవ పడింది. వాస్తవానికి కాకరకాయ ఫ్రై చేసుకుని శ్రీముఖి, బాబా భాస్కర్ తినేశారు. బాబా భాస్కర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ శివజ్యోతి మాత్రం బాగా అప్సెట్ అయిపోయింది. దీంతో శ్రీముఖి కొన్ని కాకరకాయలు తెచ్చి ముక్కలుగా కోయబోయింది. ‘ఇప్పుడొద్దు సాయంత్రం అండుకుందాంలేం’ అని అడ్డుపడింది. దీంతో శ్రీముఖికి కోపం వచ్చింది. కాకరకాయలు అక్కడ పడేసి వెళ్లిపోయింది.

ఇప్పటికే రాహుల్ ఫైనల్‌కు వెళ్లిపోయాడు. ఇక మిగిలిన ఐదుగురు తమను తాము నిరూపించుకోవడానికి, వారి అభిమానుల నుంచి ఓట్లు పొందడానికి సమయానుసారం కొన్ని ఛాలెంజ్‌లు ఇచ్చారు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్‌లను ఎంత ఎక్కువ సమయం చేస్తే మీరంత బలమైన పోటీదారుడుగా నిరూపించుకుని అభిమానుల నుంచి ఓట్లు పొందడానికి వీలుంటుందని హౌస్‌మేట్స్‌కు బిగ్ బాస్ చెప్పారు. అభిమానుల ఓట్లు మాత్రమే ఈవారం నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడతాయని బిగ్ బాస్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో ఒక నామినేటెడ్ బాక్స్ పెట్టారు. బజర్ మోగిన వెంటనే ఈవారం నామినేట్ అయిన సభ్యులంతా ఆ బాక్సులోకి వెళ్లారు. సమయానుసారంగా వారికి బిగ్ బాస్ కొన్ని ఛాలెంజ్‌లు ఇచ్చారు. అయితే వాటిలో ఏ ఛాలెంజ్ ఎవరు చేస్తారో సభ్యులే నిర్ణయించుకోవచ్చు. ఒక సభ్యుడు ఒక్క ఛాలెంజ్ మాత్రమే చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. పోస్టు బాక్సులో ఒక లెటర్ వస్తుంది, దాని మీద ఛాలెంజ్ రాసి ఉంటుంది, అది ఎవరు చేస్తారో వారు మాత్రమే నామినేటెడ్ బాక్సులో నుంచి బయటికి వచ్చి ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. గార్డెన్ ఏరియాలో ఒక రింగ్ పెట్టారు. దానితో పాటు ఒక పోల్ కూడా ఇచ్చారు. రింగ్‌కు మంట పెట్టారు. పోల్ ఒకవైపు మంట అంటించాలి. అయితే, పోల్ మంట అంటుకున్న వైపు రింగుకు తాకించకుండా దాని లోపల పెట్టి పోల్ మరో చివరన పట్టుకోవాలి. ఒకవేళ రింగుకు పోల్ తాకినట్టయితే రింగు మొత్తానికి మంట అంటుకుంది. ఈ పోటీలో వరుణ్ పాల్గొన్నారు. అతనికి ఐదు అవకాశాలు ఇచ్చారు బిగ్ బాస్.

రెండో ఛాలెంజ్‌ను బాబా భాస్కర్ తీసుకున్నారు. అదేంటి అంటే.. గార్డెన్ ఏరియాలో ఉన్న పోల్‌‌ని ఎక్కి టాస్క్ ముగిసే వరకు కాలుని కింద పెట్టకుండా పట్టుకుని ఉండాలి. ఆ పోల్ బాగా లావుగా ఉంది. దానికి కాళ్లు పెట్టుకునే వీలుండేలా రెండు చిన్న మెట్లులా ఇచ్చారు. ఒక్కో మెట్టుపై ఒక్కో కాలు పెట్టి ఆ పోల్‌ని రెండు చేతులతో కౌగిలించినట్టు పట్టుకోవాలి. బాబా భాస్కర్ అలానే చేశారు. ఇది కష్టమైన ఛాలెంజే. ఎందుకంటే గ్లాసుడు పాలలో ఒక కోడిగుడ్డు పగలగొట్టి వేసుకుని బాగా కలిపి దాన్ని తాగాలి. ఎండ్ బజర్ మోగేంత వరకు తాగుతూనే ఉండాలి. ఇలాంటి ఛాలెంజ్‌ను శివజ్యోతి తీసుకుంది. కానీ, న్యాయం చేసింది. ఒక పోల్‌కి రెండు ఇసుక మూటలు వేలాడ దీశారు. ఆ మూటలు రెడ్ కలర్ లైన్ కిందికి రాకుండా చూసుకుంటూ తాళ్లను చేతులతో పట్టుకోవాలి. టాస్క్ ముగిసే సమయం వరకు ఇలానే ఉండాలి. అంతేకాదు, ఈ ఛాలెంజ్‌ను నిలబడి మాత్రమే చేయాలి. ఇది కచ్చితంగా బలవంతుడు చేయాల్సిన టాస్క్. అందుకే అలీ ఎంపిక చేసుకున్నాడు.

చివరిగా మిగిలిన శ్రీముఖికి చేపతో ఛాలెంజ్ వచ్చింది. ఒక పెద్ద చేపను టేబుల్‌పై పెట్టారు. దానిలో ఒక మౌత్ ఆర్గాన్ ఉంది. దాన్ని అలానే ఉంచి, ఆ మౌత్ ఆర్గాన్‌ను శ్రీముఖి తన నోటిలో పెట్టుకుని ఊదుతూనే ఉండాలి. అంటే, మౌత్ ఆర్గాన్ చేప, శ్రీముఖి ఇద్దరి నోళ్లలో ఉండాలి. శ్రీముఖి కాస్త అసహ్యం పడుతూనే తప్పక చేపను ఒళ్లో పెట్టుకుని మౌత్ ఆర్గాన్ ఊదింది. ఆ తరవాత ఛాలెంజుల్లో ఉన్న సభ్యులను బిగ్ బాస్ ఒక్కొక్కరిగా రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. మొదటిగా వరుణ్ సందేశ్‌ను బిగ్ బాస్ రిలీజ్ చేశారు. ఆ తరవాత కాసేపటికి బాబా భాస్కర్‌ను రిలీజ్ చేశారు. కొంత సమయం తరవాత అలీని, అనంతరం శివజ్యోతిని, కాసేపటికి శ్రీముఖిని వరుసగా రిలీజ్ చేశారు. అందరూ తమ తమ ఛాలెంజ్‌లను విజయవంతంగా పూర్తి చేశారు.

Related posts