telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

వినూత్న ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు…

TDP-flag

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టిడిపి రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు  నరసింహ ప్రసాద్ కోయదొర వేషంలో ప్రచారం నిర్వహించారు. వైసీపీ రాజకీయ అత్యాచారం చేస్తోందని వైసీపీ నేతల ఆగడాలకు దిశని మించిన చట్టం అవసరమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు బుద్ధి చెప్పాలని కోరారు. ఏకగ్రీవాలు అనే పదానికి అర్థాన్ని మార్చేశారన్న ఆయన వైసీపీ చేతకాని పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని అన్నారు. మార్చి 10 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని టీడీపీ ప్రచారం నిర్వహిస్తోంది.  ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు.  రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ప్రచారం చేస్తున్నారు. మొన్న గురువారం నుంచి బాబు ప్రచారం చేస్తున్నారు. బాబు రంగంలోకి దిగడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ పెరిగింది. చూడాలి మారి ఈ ఎన్నికలో ఏం జరుగుతుంది అనేది.

Related posts