Ex Mp Chinta Mohan ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని.. త్వరలోనే ప్రభుత్వం పడిపోవడం ఖాయమని బాంబ్ పేల్చారు. తన స్నేహితుడి కుమారుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని సంతోషించానని.. కానీ పరిస్థితులు మాత్రం వేరేగా ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీలోకి వెళ్లిన నేతలంతా మళ్లీ తిరిగి కాంగ్రెస్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదలు కష్టాల్లో ఉన్నారని, తాను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్ని కలిసి వారి అభిప్రాయాలను సేకరించి ఈ మాట చెబుతున్నాను అన్నారు.