హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా జిగర్తాండకు ఈ సినిమా రీమేక్. ఈ సినిమాలో తమిళ్ హీరో అథర్వ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు మేకర్స్. ప్రముఖ తమిళ్ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు డిఫరెంట్ జోనర్స్లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్తేజ్ ఈ సినిమాలో గ్యాంగ్స్టర్గా మరో డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ తమిళ్లో సూపర్హిట్ అయిన జిగర్తాండ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే విధంగా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా టీజర్ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్లో వరుణ్ తేజ్ లుక్ భయపెట్టేలా ఉంది. ఐదు తలలతో వరుణ్ తేజ్లోని విభిన్న కోణాలను చూపిస్తున్న ఈ పోస్టర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తోంది.
previous post