హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా “వాల్మీకి” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన “జిగర్తాండ” సినిమాకు ఇది రీమేక్. ఆ సినిమాలో బాబీసింహా పోషించిన పాత్రను వరుణ్ తేజ్, సిద్ధార్థ్ పోషించిన పాత్రను అధర్వ మురళి చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. మృణాళిని రవి మరో హీరోయిన్ గా నటిస్తోంది. “వాల్మీకి” చిత్రాన్ని ఆచంట రాము, గోపినాథ్ లు 14రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హరీష్ శంకర్ ఈ మధ్య ప్రీ లుక్ టీజర్ విడుదల చేసాడు. ఈ ప్రీ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేసి విడుదల తేదీపై కూడా కన్ఫర్మ్ చేసాడు. ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు “వాల్మీకి” అనే టైటిల్ పెట్టడంపై అనంతపురానికి చెందిన వాల్మీకి సంఘం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
previous post
నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు..