టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిమ్మగడ్డ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఆయన మాట్లాడుతూ… గన్నవరంలో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్ధులు లేరు అని పేర్కొన్నారు. అయితే పార్టీలో కొంత కాలంగా గ్రూపులు ఉన్నాయి.ఓట్లు చీలకుండా ఉండేందుకు పార్టీ అధిష్టానం కొన్ని సూచనలు చేసింది. పార్టీ అధినాయకత్వం సూచనల మేరకు అందరూ వ్యవహరిస్తారు అని చెప్పిన ఆయన నిమ్మగడ్డకు పిచ్చి ముదిరింది. నిమ్మగడ్డ నియంతృత్వ పోకడలకు పోతున్నారు అని పేర్కొన్నారు. ఫిర్యాదులు వస్తే పరిశీలించాలి కానీ.. గృహ నిర్బంధం విధించడం ఏమిటీ..? విచారణ జరపకుండా అనామకుల కంప్లైంట్లపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారు..? చంద్రబాబు ఫేస్ టైములో చెప్పగానే నిమ్మగడ్డ చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఎస్ఈసీ చర్యలకు అన్ని సరిపెడతాం. ఏకగ్రీవాలనేవి కాసు బ్రహ్మానంద రెడ్డి కాలం నుంచే ఉన్నాయి. ఏకగ్రీవాలకు ప్రొత్సహకాల జీవో ఇచ్చింది చంద్రబాబే. కొత్తగా ఈ రోజే ఏకగ్రీవాలు జరుగుతున్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు అని చెప్పిన ఆయన టీడీపీ ఏకగ్రీవాలు కూడా బలవంతమేనా అని అడిగారు. చుడాలిమరి దీనికి నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారు అనేది.
previous post
పోతిరెడ్డిపాడును జగన్కు కేసీఆర్ గిఫ్ట్గా ఇచ్చారు: రేవంత్రెడ్డి