ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారాలంటే తప్పనిసరిగా రాజీనామా చేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. సరికొత్త టెక్నాలజీ వినియోగంపై ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ స్పీకర్ల సబ్ కమిటీ సమావేశానికి తమ్మినేని హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవని అన్నారు. సభానాయకుడిగా సీఎం కూడా అదే చెప్పారని, దానికే కట్టుబడి ఉన్నామని తెలిపారు. వల్లభనేని వంశీకి కూడా ఇదే విధానం వర్తిస్తుందని తెలిపారు. వంశీ వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచించారు.