telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇప్పుడున్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం: హర్ సిమ్రత్ కౌర్

Harsimrat Kaur

ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ, ఎన్డీయే నుంచి ఎస్ఏడీ వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన వెంటనే శిరోమణి అకాలీదళ్ నేత, కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. నాడు ఏబీ వాజ్ పేయి దూరదృష్టితో ప్రారంభించిన ఎన్డీయే కాదని, ఇప్పుడున్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని అన్నారు.

“మూడు కోట్ల మంది పంజాబీల బాధ, నిరసనలు విఫలమయ్యాయి. ఇప్పుడు భారతావనిని ఏలుతున్నది వాజ్ పేయి, బాదల్ ప్రారంభించిన ఎన్డీయే కాదు. ఈ కూటమి తన దీర్ఘకాల మిత్రుడి బాధను వినని చెవిటిది అయిపోయింది. ఈ ఎన్డీయే కళ్లు గుడ్డివి. దేశానికి అన్నం పెడుతున్న వారి ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts