telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరుగుతున్నాయి.

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం..

క‌లియుగ వైకుంఠ స్వామి తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. బుధవారం అర్ధరాత్రి 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. అర్ధరాత్రి నుంచే 12 గంటల నుంచి నిత్య సేవలు, కైంకర్యాల అనంతరం వేకువజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం మొదలైంది.

Vaikuntha Ekadashi 2022: Today mukkoti ekadashi ttd and other temples allows Vaikunta Dwara darshanam| వైకుంఠ ఏకాదశి, తిరుమలతో పాటు అనేక ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనంఆధ్యాత్మికం News in Telugu

తొలుత‌ ప్రొటోకాల్ ప్రకారం.. VIPలను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. రాజకీయ, సినీరంగ ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, పలు రాష్ట్రాల సీజేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సినిమా సెలబ్రిటీలు స్వామిని దర్శించుకున్నారు. ప్రముఖుల దర్శనాల అనంతరం సామాన్య భక్తుల్ని అనుమతించారు.

అలాగే తిరుమలలో 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా భక్తులు వెంకన్నను దర్శించుకోవచ్చు. ఈ ఉదయం 9 నుంచి 10గంటల వరకు స్వర్ణరథంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముక్కోటి ఏకాద‌శి సంద‌ర్భంగా స్వామి వారిని ద‌ర్శించుకోవ‌డాని పెద్ద ఎత్తున భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకున్నారు.

Tirumala : జనవరి 13,14 తేదీల్లో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలు | Vaikuntha Ekadashi and Dwadashi celebrations in Tirumala

అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయం అందంగా ముస్తాబైంది. మాడ‌వీదులు విద్యుత్ దీపాలంకరణతో వెలుగిపోతున్నాయి. శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పుష్పాలు,పండ్లతో సర్వాంగ సుందరంగగా అలంకరించారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం వచ్చే భక్తులకు ఈ పుష్పాలంకరణ అదనపు ఆకర్షణ కానుంది.

 

Related posts