telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈటల మాత్రమే కాదు.. అన్ని పార్టీల నేతల కబ్జాలపై విచారణ చేయండి : విహెచ్ డిమాండ్

మంత్రి ఈటెల మీద భూ ఆరోపణలు వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారని..మంత్రి ఈటెల మాత్రమే కాదు.. అన్ని పార్టీల నేతల భూకబ్జా లపై విచారణ చేయాలని వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ లో కరోనా విజృంభిస్తుంది… ఎన్ని డబ్బులు చెల్లించిన ప్రైవేట్ హాస్పిటల్ ల దోపిడీ ఆగడం లేదు…ఈ పరిస్థితిలో సీఎం కేసీఆర్ మంత్రి ఈటెల మీద విచారణ చేయడమేంటి ? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో ఎందుకు విచారణ ఎందుకు చేయలేదని…గతంలో మంత్రి మల్లారెడ్డి, యాదగిరిరెడ్డి మీద ఆరోపణలు వచ్చిన పట్టించుకోరు… వారిపై ఒక్క విచారణ చేయలేదని నిలదీశారు. కీసరలో దళితుల భూములు కబ్జా అవుతుంటే ఎందుకు స్పందించలేదు… గాంధీ ట్రస్ట్ భూములు, వక్స్ భూములు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈటెల రెండు రోజుల క్రితం కేంద్రం తీరును తప్పు పట్టడమే ఆయన చేసిన తప్పిదమా? గతంలో లాక్ డౌన్ లో కిరాయిలు అడగొద్దని చెప్పిన వ్యక్తి.. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ ని అరికట్టలేరా? అని పేర్కొన్నారు.

Related posts