telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముదురుతున్న “సైరా” వివాదం… చిరంజీవి, చరణ్ లపై ఫిర్యాదు

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. సెలెబ్రిటీలు కూడా సైరా ట్రైలర్ చూసి ఫిదా అయిపోతున్నారు. “సైరా” ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 34 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. కాగా… కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ అధినేతలైన హీరో చిరంజీవి, నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌ల‌పై ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కుటుంబ స‌భ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోదుడైన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ను వార‌సుల‌మైన త‌మ నుండి తీసుకుని డ‌బ్బులు ఇస్తామ‌ని చెప్పి అగ్రిమెంగ‌ట్ ఇచ్చార‌ని..23 మంది కుటుంబ సభ్యులకు రూ.50 కోట్లు ఇస్తామన్నారని.. కానీ ఇప్పుడు డ‌బ్బులు ఇవ్వ‌కుండా మోసం చేశార‌న్నారు. ఆ విషయం అడ‌గ‌టానికి చిరంజీవి ఇంటికి వెళితే త‌మపై అక్ర‌మంగా కేసులు పెట్టార‌ని ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. సినిమా మేకింగ్ స‌మ‌యంలో త‌మ‌కు డ‌బ్బులు ఇస్తామ‌న్న నిర్మాత‌లు.. త‌ర్వాత ప‌ట్టించుకోలేద‌ని ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తూ ఇటీవ‌ల చిరంజీవి ఆఫీస్ ముందు ఆందోళ‌న చేశారు. పోలీసులు ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యుల‌ను అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యులు చిరంజీవి, చ‌ర‌ణ్‌ల‌పై కేసు పెట్ట‌డంతో వివాదం మ‌రోమారు తెర‌పైకి వ‌చ్చింది.

Related posts