అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరిగాయి.
ఉత్తర ప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అఖండ విజయం సాధించారు. లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో గోరఖ్పూర్ అర్భన్ స్థానం నుంచి గెలుపొందారు. ఇక్కడ బీజేపీకి ప్రజలు మరొసారి బ్రహ్మరథం పట్టారు. వరుసగా మరొసారి బీజేపీ విజయం సాధించింది.
ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..యూపీ లో అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈ విజయాన్ని అందించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం మనకు జవాబుదారీతనానికి సంకేతాన్ని కూడా ఇస్తుందని, అందుకే ఉత్సాహంతో మనస్ఫూర్తిగా నిలదొక్కుకోవాలన్నారు. మరింత బలంతో సామాన్యుల ఆకాంక్షలకు అనుగుణంగా మరోసారి మనల్ని మనం నిరూపించుకోవాలని సీఎం అన్నారు.
కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డి: లోకేష్