telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ మద్దతు: ఉత్తమ్

uttam congress mp

ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ మద్దతు తెలుపుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కోదాడలో ఆర్టీసీ కార్మికులతో ఉత్తమ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ఉత్తమ్ కుమార్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఈ ఉప ఎన్నికలో తమ పార్టీకే మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. పలు జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసనల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోని టీఎంయూ కార్యాలయంలో ఆర్టీసీ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు.

Related posts