telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సంచయితపై మండిపడ్డ ఊర్మిళ గజపతి రాజు !

సంచయితపై ఊర్మిళ గజపతి రాజు మండిపడ్డారు. మాన్సస్ ట్రస్ట్ లో అనేక అన్యాయాలు జరుగుతున్నాయని తెలిపారు. మాన్సస్ ట్రస్ట్ లో జరుగుతున్న అన్యాయాలపై సీఎం చర్యలు తీసుకోవాలని ఊర్మిళా గజపతి రాజు పేర్కొన్నారు. మాన్సస్ ట్రస్ట్ లో ఉద్యోగులకు ఎన్నో నెలలుగా జీతాలు రాకపోవటం బాధాకరమని.. విద్యార్థులు కూడా నిరసన తెలిపారని గుర్తు చేశారు. తమ తాత పివిజి రాజు విగ్రహం వద్ద నిరసన తెలిపటం బాధను కలిగిస్తుందని.. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదన్నారు. సింహాచలం దేవస్థానంలో ఉద్యోగులకు కూడా జీతాలు రావట్లేదని.. మాన్సస్ ట్రస్ట్ కార్యాలయాన్ని పివిజి రాజు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పివిజి గారు స్థాపించిన కార్యాలయానికి కొంత సెంటిమెంట్ ఉందని..తాను మాన్సస్ ట్రస్ట్ మెంబర్ గా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాను ప్రమాణస్వీకారం చేసేందుకు ఎవరు ఆహ్వానించట్లేదని.. మాన్సస్ ట్రస్ట్ లో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ప్రస్తుతం మాన్సస్ లో జరుగుతున్న పరిణామాలు అధికార పార్టీ పై పడుతున్నాయన్నారు.

Related posts