మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా ఓ షాకింగ్ పిక్ షేర్ చేసింది. మెగా కోడలు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఇలా చేసింది. తన ఒడిలో పులిని కూర్చోబెట్టుకొని స్వయంగా పాలు పట్టిస్తున్న పిక్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతర్జాతీయ పులుల దినోత్సవం (జులై 29) సందర్భంగా పులులపై ప్రేమను చాటుకుంటూ పులికి పాలు పట్టించింది ఉపాసన. ”పులి పిల్లకు పాలు పట్టడం ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది.. కానీ మళ్ళీ ఇలాంటి పని ఎప్పుడూ చేయను. అడవుల్లో కంటే జ ల్లోనే పులుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పులుల సంచారం ఎక్కువగా ఉంటోంది. మీరంతా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు వాటికి రక్షణ కల్పించాలి” అని పేర్కొంటూ సందేశమిచ్చింది.
Was so excited to feed a tiger cub.But would never do it again!
Statistics show that there are more tigers in captivity than in the wild
#InternationalTigerDay2020 if u reside in hyderabad- there are tigers living in the wild less than 3 hours away🐯 than need ur protection pic.twitter.com/qi4N1PnFwU
— Upasana Konidela (@upasanakonidela) July 29, 2020
ఈ పిక్ క్షణాల్లో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఉపాసనకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. మెగా ఫ్యామిలీ విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది ఉపాసన. అంతేకాదు ఆరోగ్య చిట్కాలు, సంప్రదాయ పద్దతుల గురించి కూడా అందరికీ తెలియజేస్తుంది.