ఉత్తర్ప్రదేశ్లో కరోనా శరవేగంగా దూసుకుపోతోంది. దీంతో అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలు శాఖల అధికారులకు వైరస్ సోకింది. తాజాగా, యూపీ ఆరోగ్యమంత్రి జై ప్రతాప్ సింగ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు మంత్రిని కలిసిన వారెవరనే అంశంపై దృష్టిపెట్టారు.
మరోవైపు, ఆయన కుటుంబ సభ్యుల నుంచి శాంపిల్స్ సేకరించారు. వారందరి నివేదికలు శనివారం వచ్చే అవకాశం ఉంది. కొద్దిపాటి జ్వరం రావడంతో ఆయన పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్గా నిర్ధారణ అయింది. యూపీలో నిన్న ఒక్కరోజే 2516 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు వచ్చిన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,104కి చేరింది.