telugu navyamedia
రాజకీయ

యూపీలో ప్రారంభ‌మైన‌ ఆరో విడత పోలింగ్​..

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ గురువారం( మార్చి 3న) ప్రారంభమైంది. ఖుషీనగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, అంబేద్కర్ నగర్, గోరఖ్‌పూర్, డియోరియా , బల్లియా– 10 జిల్లాల్లోని మొత్తం 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. 676 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగనుంది. ఈ విడతలో రెండు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

ఆరవ దశలో..ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సొంతగడ్డ అయిన గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Related posts