telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి క‌రోనా పాజిటివ్‌

దేశంలో క‌రోనా ర‌క్క‌సి విజృంభిస్తుంది..రోజురోజుకు కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్నాయి. సామాన్య‌లు నుంచి సెల‌బ్రెటీలు, రాజ‌కీయ‌నేత‌లు వరుసగా క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్రముఖులు ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

తాజాగా బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా సోకింది. త‌నకు కొవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కిషన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

కాగా…ఈ ట్వీట్‌కు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ స్పందించారు. త్వర‌గా క‌రోనా నుంచి కోలుకోవాల‌ని కామెంట్ చేశారు. అలాగే కేంద్రమంత్రి నితిన్ గ‌డ్కారీ కూడా కిష‌న్ రెడ్డి త్వరగా కోలుకోవాల‌ని కోరుతూ పోస్ట్ చేశారు.

Related posts