telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

కరోనా ఎఫెక్ట్… ఇకపై క్రికెట్ లో కొత్త రూల్స్

ICC

కరోనా వైరస్ కారణంగా క్రికెట్ నిబంధనల్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరింత కఠినతరం చేసింది. జూన్ నుంచి మళ్లీ క్రికెట్ సిరీస్‌లు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తుండగా.. మైదానంలో ఆటగాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు మ్యాచ్ అధికారులు, అంపైర్లు నడుచుకోవాల్సిన తీరుపై ప్రత్యేకంగా కొన్ని రూల్స్‌ని ఐసీసీ తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో క్రికెటర్లు, అంపైర్ల మధ్య ఉన్న చైన్ సైకిల్ రిలేషన్‌ని పూర్తిగా తప్పించింది. సాధారణంగా ఓవర్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ టీమ్ బంతిని ఫీల్డ్ అంపైర్‌కి స్వాధీనం చేస్తుంది. వన్డేల్లో అయితే.. రెండు బంతుల్ని వినియోగిస్తుంటారు. దాంతో.. ప్రతి ఓవర్‌కి ముందు స్ట్రైకింగ్ అంపైర్ చేతి నుంచి బౌలర్ బంతిని అందుకోవాల్సి ఉంటుంది. ఇకపై కూడా అదే రూల్‌ని కొనసాగించిన ఐసీసీ.. అంపైర్ మాత్రం బంతిని అందుకునేముందు తన చేతులకి గ్లౌవ్స్‌ని ధరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో బౌలర్ బౌలింగ్ చేసే ముందు అంపైర్‌కి తన టోపీ, కళ్లద్దాలు ఇవ్వడాన్ని కూడా నిషేధించిన ఐసీసీ.. మైదానంలో ఆటగాళ్ల మధ్యే కాకుండా.. వారితో అంపైర్లు కూడా కనీసం 1.5 మీటర్లు దూరంగా ఉండాలని సూచించింది. క్రికెట్ జట్టు సిరీస్‌కి ముందు 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటే.. అది కరోనా ఫ్రీ జట్టుగా మారుతుంది. కాబట్టి.. ఆ టీమ్‌లోని ఆటగాళ్ల మధ్య కరోనా వైరస్ వ్యాప్తించే ప్రమాదం తగ్గుతుంది. ఇక మైదానంలోని క్రికెటర్లకి బయటి నుంచి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్న వ్యక్తులు ఫీల్డ్ అంపైర్లు మాత్రమే. అంపైర్లు, ఆటగాళ్ల మధ్య ఉన్న చైన్ సైకిల్ బంతిని, టోపీ, కళ్లద్దాలు ఇచ్చిపుచ్చుకోవడం. ఇందులో టోపీ, కళ్లద్దాలను అంపైర్లకి అప్పగించడాన్ని తప్పిస్తే.. బంతిని మాత్రం తప్పనిసరిగా స్వాధీనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి.. బంతిని అందుకునేముందు అంపైర్లు గ్లౌవ్స్‌ని ధరించాలని ఐసీసీ ఆదేశించింది.

Related posts