telugu navyamedia
రాజకీయ వార్తలు

కామాంధులకు ఇదో గుణపాఠం: ఉమాభారతి

umabarati as bjp wise president

మహిళలను వేధించే కామాంధులకు ఇదో గుణపాఠమని బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి అన్నారు. నిందితులు అదే ప్రాంతంలో చావడం వల్ల దిశ ఆత్మశాంతిస్తుందన్నారు. ఈ మేరకు ఆమె తన అభిప్రాయాన్ని హిందీలో ట్వీట్ చేశారు.దిశ హత్యోదంతం కేసులో ఎన్ కౌంటర్ ద్వారా పోలీసులు బాధిత కుటుంబానికి సముచిత న్యాయం చేశారని ప్రశంసించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులను కదిలించిన సంఘటన ఇది అని అన్నారు. ఈ ఏడాది చివరిలో జరిగిన అత్యంత పాశవిక నేరమని ఆమె వ్యాఖ్యానించారు. పోలీసుల చర్యలు మహిళలకు ఎంతో భద్రత ఇస్తాయని, ధైర్యాన్ని ప్రోది చేస్తాయని ఆమె వ్యాఖ్యానించారు. నేరస్తులకు సత్వర గుణపాఠం చెప్పేలా తెలంగాణ పోలీసులు వ్యవహరించారని ఆమె కొనియాడారు.

Related posts