telugu navyamedia
రాజకీయ వార్తలు

నేడు అయోధ్యకు ఉద్ధవ్ థాకరే!

uddhav-thackeray-shivasena

శివసేన అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నేడు అయోధ్యకు వెళుతున్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం ఉద్ధవ్ థాకరే ముంబై నుంచి లక్నో చేరుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 4.30 గంటలకు అయోధ్యకు ఆయన రోడ్డు మార్గంలో బయల్దేరుతారు.

తన పర్యటనలో భాగంగా అయోధ్యలోని రామ మందిరంలో థాకరే పూజలు నిర్వహించనున్నారు. అయితే ఎంతో ప్రఖ్యాతిగాంచిన సరయూ నదిలో నిర్వహించే హారతి కార్యక్రమానికి మాత్రం ఆయన దూరంగా వుంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. ఈ సందర్భంగా శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, వైద్య అధికారుల సూచన మేరకు హారతి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టు తెలిపారు.

Related posts