ఈ ఆధునిక యుగంలో సోషల్ మీడియా ప్లాట్ఫాం అనేది ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది అనేది అందరికీ తెలిసిందే. ట్విట్టర్ వేదికగా అనేక విషయాలని మనం ప్రజలకి తెలియజేయవచ్చు… తెలుసుకోవచ్చు… అయితే కొద్ది రోజులుగా జనసైనికులు పవన్ పిలుపు మేరకు నల్లమల అడవిలోని యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. “వైస్ జగన్ ఫేయిల్డ్ యాజ్ సీఎం”తో పాటు “సేవ్ నల్లమల” అనే యాష్ ట్యాగ్తో మరి ట్రెండ్ చేస్తున్నారు. ఇది ట్విట్టర్ ప్లాట్ఫాం నిబంధనలకి విరుద్దం. ఈ కారణంగా మీ ట్విట్టర్ అకౌంట్స్ సస్పెండ్స్ చేస్తున్నామని మెయిల్స్ వచ్చాయట జనసైనికులకు. దాదాపు 400 మంది అకౌంట్స్ సస్పెండ్స్ కావడంతో జనసైనికులు షాక్కి గురయ్యారు. సోషల్ మీడియా ద్వారా తమ గొంతుని స్ట్రాంగ్గా వినిపిస్తున్న సమయంలో ట్విట్టర్ యాజమాన్యం ఇలా చేయడం దారుణమైన సంఘటన అని జనసైనికులు వాపోతున్నారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ #BringBackJSPSocialMedia అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు పవన్.
I don’t understand the reason for suspending 400 twitter accounts of Janasena supporters.The reason behind the suspension of these accounts ; just for standing by helpless people and their issues? And how do we understand this?#BringBackJSPSocialMedia
— Pawan Kalyan (@PawanKalyan) 18 September 2019