సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఫ్రాంఛైజీగా తన సొంత జట్టు ఆడుతున్న మ్యాచ్లో రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు కావ్య మారన్. మ్యాచ్లను చూస్తూ తనను తాను మర్చిపోతుంటారు. తన ఎమోషన్స్ను ఏ మాత్రం దాచుకోలేకపోతుంటారు. జట్టు గెలిస్తే.. ఎగిరి గంతేయడం, ఓడిపోతే.. కంటనీరు పెట్టుకోవడం సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. ఆ ఎమోషన్స్తోనే లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తనలోని భావోద్వేగాన్ని కావ్య మారన్ మరోసారి బయటపెట్టుకున్నారు. గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్, కోల్కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో నమోదైన ఓ క్యాచ్ ఆమెను కట్టిపడేసింది. ఆ క్యాచ్ పట్టిన ఫీల్డర్ను ఆమె ఆకాశానికెత్తేశారు. ఇలాంటి ఫీట్ ఇప్పటిదాకా చూడలేదంటూ ప్రశంసించారు. ఐపీఎల్ 2021 సీజన్లో ఇప్పటిదాకా నమోదైన అన్నింట్లోకి ఇదే అత్యుత్తమ క్యాచ్గా ఆమె అభివర్ణించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఆ క్యాచ్- పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ పట్టినది. కోల్కత నైట్ రైడర్స్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ను పెవిలియన్ పట్టించడానికి రవి బిష్ణోయ్ పట్టిన క్యాచ్.. ఆ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.
previous post
next post
ఈ ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎదురుదెబ్బే తగిలింది: నారా భువనేశ్వరి