telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంగనా రనౌత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ట్విటర్

Kangana

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. ఈ అమ్మడు ఎప్పుడు కాంట్రవర్సీల చుట్టే తిరుగుతుంది. అయితే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ షెడ్యూల్ గడుపుతోంది. ఇది ఇలా ఉండగా పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జయ కేతనం ఎగరేసిన నేపథ్యంలో పలు నియోజక వర్గాలలో హింస చెలరేగింది. బీజేపీ, ఏబీవీపీ కార్యాలయాలను ధ్వంసం చేయడంతో పాటు కొన్ని చోట్ల టీసిఎం కార్యకర్తలు వాటిని తగలబెట్టే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన బీజేపీ కార్యకర్తలు, పోలీసులపై దాడి చేశారు. బీజేపీ సానుభూతి పరుల దుకాణాలను కొన్ని చోట్ల లూఠీ చేశారు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీవ్రంగా విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా దాడికి దిగింది. తాను ఆమెను గతంలో రావణాసుడితో పోల్చానని కానీ రావణుడు గొప్ప పరిపాలనాధికారి, విద్వాంసుడు, జ్ఞానవంతుడు అని చెబుతూ, ఈమె రక్తపిశాచి అని మమతను విమర్శించింది. అంతేకాదు. ఆమెకు ఓటు వేసిన వారందరికీ ఆ రక్తపు మరకలు అంటుకుంటాయని తెలిపింది. కంగనా రనౌత్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ట్విట్టర్ నిర్వాహకులు ఆమె అక్కౌంట్ ను సస్పెండ్ చేశారు. 

Related posts