telugu navyamedia
Uncategorized

ఉరేసుకొని టీవీ నటి రేఖ ఆత్మహత్య

Tv actior rekha suicide

టీవీ నటి మద్దెల సబీరా(రేఖ) (42) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన రేఖ హైదరాబాద్ వచ్చి రెండు టీవీ సీరియళ్లలో నటించారు. అయితే, ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తిరిగి గుంటూరు వెళ్లిపోయి అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు.

అనంతరం చైతన్యను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం విద్యానగర్‌లో ఉంటున్న రేఖ కొన్నాళ్లపాటు వివిధ కార్యక్రమాలల్లో పాటలు పాడడం, యాంకరింగ్ చేయడం వంటివి చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆమె భర్త చైతన్య నష్టాలపాలవడంతో రేఖ కుంగిపోయారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె నిన్న బాత్రూములో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts