హైదరాబాద్ లో బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని శ్రీనగర్ కాలనీలో సాయి అపార్ట్మెంట్లోని తన నివాసంలో ఝాన్సీ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఓ యువకుడిని ప్రేమించి విఫలమైనందునే విరక్తి చెందిన ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ‘పవిత్రబంధం’ సీరియల్ తో ఝాన్సీ తెలుగు టీవీ ప్రేక్షకులకు చేరువైంది. ఆమె మరణంపై పలువురు టీవీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలి: జేసీ దివాకర్రెడ్డి