telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

కరోన ఎఫెక్ట్.. టీయూడబ్ల్యూజే మహాసభలువాయిదా

tuwj hyd

ఈ నెల 8న హైద్రాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర మహాసభలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ సంఘ నాయకులు ప్రకటించారు. కరోనా వైరస్ ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర మహాసభలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

కరోన వైరస్ గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాద్ కు సైతం వ్యాపించడంతో ఇక్కడ కొంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తోపాటు పోలీస్ అధికారులు, హైకోర్టు సూచనలు, లాంటి విషయాలను పరిగణలోకి తీసుకోని మహాసభలను వాయిదా వేసినట్టు వివరించారు.

Related posts