telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

టీటీడీలో అక్రమాలపై గవర్నర్ కు ఫిర్యాదు 

two days special rules in ttd
టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అక్రమార్కులకు నిలయంగా మారిపోయిందన్నారు. టీటీడీలోఅధికారులు ఎన్ని దారుణాలకు పాల్పడుతున్నా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. గత నెలలో టిక్కెట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. టిక్కెట్లను భారీ ఎత్తున అమ్ముకుంటున్నారని బహిర్గతమైనా ఏపీ సర్కారు పట్టించుకోలేదని చెప్పారు. 
నిందితులను ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని లక్ష్మణ్ ఆరోపించారు. నిత్యమూ వందలాది టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముతూ కోట్లను దండుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లక్ష్మణ్ తో పాటు గవర్నర్ ను కలిసి మాజీ డీజీపీ, ప్రస్తుత బీజేపీ నేత దినేష్ రెడ్డి మాట్లాడుతూ..తాను డీజీపీగా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని తాము గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Related posts