telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు

ramana dikshitulu on jagan victory

టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో జరిగిన పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులును పాలకమండలి నియమించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2019-20 టీటీడీ బడ్జెట్ ను కూడా ప్రకటించారు. రూ.3243 కోట్ల వార్షిక రివైజ్డ్ బడ్జెట్ కు పాలకమండలి ఆమోదం తెలిపింది.

రూ.8 కోట్లతో రెండు ఘాట్ రోడ్డుల మరమ్మతులకు అనుమతులు లభించాయి. జమ్మూకశ్మీర్, వారణాసిలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. రూ.30 కోట్లతో ముంబయిలో శ్రీవారి ఆలయం నిర్మించాలని తీర్మానించారు. ముఖ్యంగా, సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటుకు కూడా టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది.

Related posts