నవీ ముంబైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, బాంద్రాలో టీటీడీ సమాచార కేంద్రం నిర్మాణానికి భూమి కావాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వినతి పత్రాన్ని అందజేశారు.
సోమవారం సాయంత్రం తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న మూడు రోజుల అంతర్జాతీయ ఆలయ సమ్మేళనం సందర్భంగా సైట్ కేటాయింపు కోరుతూ వినతి పత్రాన్ని అందజేసారు.
ఈ మెగా ఈవెంట్ను గోవా సీఎం ప్రమోద్తో కలిసి ఏపీ, మహారాష్ట్ర సీఎంలు ప్రారంభించి సదస్సులో పాల్గొన్నారు.
నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గతంలో 3.61 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన టీటీడీకి కేటాయించిన సంగతి ఇక్కడ ప్రస్తావించవచ్చు.
మరో 1.5 ఎకరాల స్థలంలో అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. అందుకని, అమ్మవారి ఆలయాన్ని నిర్మించేందుకు కొంత భూమిని, బాంద్రాలో టిటిడి సమాచార కేంద్రానికి కొంత స్థలాన్ని కేటాయించాలని టిటిడి మహా ప్రభుత్వాన్ని కోరింది.