తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఇప్పటికే ప్రతిపక్షాలు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ధర్నా జరిగింది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ యూనినయన్, ఏఐటీయూసీ నేతలు తెలంగాణ భవన్ వద్ద ధర్నాకు దిగారు.
బర్తరఫ్ చేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన యూనియన్ నాయకులను విడుదల చేయాలన్నారు. ఈ సందర్భంగా వారు కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంత గిరికి వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోంది: లోకేశ్