తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ డిపోకు చెందిన బస్సు ఏపీలో అదుపుతప్పి బోల్తాపడింది. విజయవాడ-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నిర్మల్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
previous post