telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

బీజేపీలో కూడా పిచ్చోళ్లు తయారయ్యారు: బుద్ధా వెంకన్న

బీజేపీ నేతల పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే జీవీఎల్ కు దేహశుద్ధి తప్పదని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. నేతలు విమర్శలు చేసేటప్పుడు నోటికి హద్దు, అదుపు ఉండాలని ఆయన అన్నారు. మొన్నటివరకూ వైసీపీలోనే పిచ్చోళ్లు ఉన్నారని అనుకున్నామనీ, కానీ ఇప్పుడు బీజేపీలో కూడా తయారయ్యారని వ్యంగస్త్రాలు సంధించారు
ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించడానికే బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావుకు పదవిని కట్టబెట్టారని  విమర్శించారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ ఓ పిచ్చోడనీ, ప్రధాని మోదీ ఈ పిచ్చోడి చేతికి రాయి ఇచ్చారని దుయ్యబట్టారు. బీజేపీ, వైసీపీలకు రోజులు దగ్గర పడ్డాయని బుద్ధా పేర్కొన్నారు.  రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Related posts