telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రజాసంగ్రామ యాత్రను ఆపండి : బండి సంజయ్‌కు వ‌రంగ‌ల్‌ పోలీసులు నోటీసులు

*బండి సంజయ్‌కు వ‌రంగ‌ల్‌ పోలీసులు నోటీసులు
*ప్రజాసంగ్రామ యాత్రను ఆపండి..
*నోటీసులు జారీ చేసిన వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్‌
*చ‌ట్ట ప్రకారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న పోలీసులు

ప్రజా సంగ్రామ యాత్రను ఆపేయాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌కు వ‌రంగ‌ల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రముఖ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్‌కు వర్దన్నపేట ఏసీపీ నోటీసులు జారీ చేశారు.

జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని… ధర్మదీక్షపేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని వెల్లడించారు. దీని వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు.

దీంతో వెంటనే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నోటీసు పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

TS Police issued a notice to Bandi Sanjay to stop the Praja Sangrama Yatra

Related posts