telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ ఎక్కడుంటే మీకెందుకు.. విపక్షాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

srinivas goud trs

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విపక్షాలు సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పాత సచివాలయం కూల్చివేతపై మండిపడుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉంటే కేసీఆర్ ఎక్కడున్నాడంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఎక్కడుంటే మీకెందుకని నిలదీశారు.

రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ పథకమైనా ఆగిందా అని ప్రశ్నించారు. ఆరేళ్ల కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగమని తెలిపారు. తెలంగాణ వెనుకబాటుతనానికి ఆంధ్రా నాయకులే కారణమని ఇన్నాళ్లూ భావించామని, కానీ ఇక్కడి నాయకులే కారణమని ఇప్పుడర్థమవుతోందని అన్నారు. హైదరాబాద్ నగరం తెలంగాణ సొత్తు అని అన్నారు. ఇక్కడ ఇతరుల పెత్తనాన్ని సహించమని ఆయన అన్నారు

Related posts