తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విపక్షాలు సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పాత సచివాలయం కూల్చివేతపై మండిపడుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉంటే కేసీఆర్ ఎక్కడున్నాడంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఎక్కడుంటే మీకెందుకని నిలదీశారు.
రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ పథకమైనా ఆగిందా అని ప్రశ్నించారు. ఆరేళ్ల కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగమని తెలిపారు. తెలంగాణ వెనుకబాటుతనానికి ఆంధ్రా నాయకులే కారణమని ఇన్నాళ్లూ భావించామని, కానీ ఇక్కడి నాయకులే కారణమని ఇప్పుడర్థమవుతోందని అన్నారు. హైదరాబాద్ నగరం తెలంగాణ సొత్తు అని అన్నారు. ఇక్కడ ఇతరుల పెత్తనాన్ని సహించమని ఆయన అన్నారు