telugu navyamedia
తెలంగాణ వార్తలు

రైతులతో చెలగాటం… రాజకీయ సంకటం

తెలంగాణ వ్యాప్తంగా కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా దుడ్ గ్రామంలో రైతులతో కలిసి టిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ సహకార సంఘం చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, సుంకిశాల సంపత్ రావు, రైతు సంఘం నాయకుడు మంద రాజమల్లు టీఆర్ఎస్ నాయకులు, కార్యర్తలతో కలసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలుచేయాలని డిమాండ్ చేశారు. రైతుల్ని ఇబ్బందులు పెట్టే పాలకులకు రాజకీయ మనుగడ లేకుండా చేస్తామని ప్రతిన బూనారు.

Related posts